Monday, March 29, 2010

కరీంనగర్ జిల్లా

Teen_minar_Elgandal_fort_Karimnagar.jpg కరీంనగర్ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ఒక జిల్లా. జిల్లాకు ఉత్తరాన అదిలాబాదు జిల్లా, ఈశాన్యమున మహారాష్ట్ర మరియు చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన వరంగల్ జిల్లా, ఆగ్నేయాన మెదక్ జిల్లా, మరియు తూర్పున నిజామాబాదు జిల్లా సరిహద్దులు.
కరీంనగర్, సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణము చేయబడినది. పురాతన కాలము నుండి వేద అభ్యాసన కేంద్రముగా ప్రసిద్ధికెక్కినది. పూర్వము ఈ ప్రాంతమునకు 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్ మరియు శ్రీశైలములలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల II మరియు ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధాని మరియు మాజీ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు వంటి పలు సుప్రసిద్ధ వ్యక్తులు ఈ జిల్లా వాస్తవ్యులే. గోదావరి నది ఈ ప్రాంత సౌందర్యమును మరింత ఇనుమడింపజేస్తున్నది. కరీంనగర్ గోండ్లు, కోయలు, చెంచులు మొదలైనటువంటి అనేక గిరిజన జాతులకు ఆవాసము. ఈ ప్రాంతీయులు సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో మంచి నిపుణులు.

నేటి కరీంనగర్ ప్రాంతాన్ని పూర్వం సబ్బినాడు అని వ్యవహరించేవారు. 1905కు పూర్వము జిల్లా ఎలగందల్ జిల్లాగా ప్రసిద్ధి చెందినది. 1905లో వరంగల్‌ జిల్లా నుండి పర్కాల తాలూకాను జిల్లాలో కలిపి, లక్సెట్టిపేట మరియు చెన్నూరు తాలూకాలను అదిలాబాద్‌ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్‌ లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్‌వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లాగా నామకరణము చేశారు.

కరీంనగర్ కు 30. కి.మీ. దూరంలో గోదావరి నది శాఖైన మూలవాగు తీరంలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. కరీంనగర్ కు ఉత్తరంగా 50 కి.మీ. దూరంలో గోదావరీ తీరంలోని ధర్మపురిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇవికాక జగత్యాల కొండగట్టు దగ్గర శ్రీఆంజనేయస్వామి ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. రామగుండం వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బొగ్గు ముడిపదార్థంగా ఉపయోగించి ఎరువును తయారుచేసిన మొట్టమొదటి ఫ్యాక్టరీ. నల్ల బంగారం ఉత్పత్తిలో సిరులపంట పండిస్తున్న సింగరేణి, ఖజానాలో ఎక్కువ ఆదాయం లభించేది రామగుండం నుంచే. 2001 జనాభాలెక్కల ప్రాధమిక అంచనా ప్రకారం ఈ జిల్లాలో పురుషుల కంటే స్త్రీల జనాభా అధికంగా ఉంది.

గణాంకాలు

* రాష్ట్రవైశాల్యంలో జిల్లా వైశాల్యం శాతం - 4.29
* రాష్ట్రజనాభాలో జిల్లా జనాభా శాతం - 4.59
* నగరీకరణ - 20.55%
* వర్షపాతం - 953 మి.మీ.
* అడవుల శాతం - 21.18
* రెవిన్యూ డివిజన్లు : 4 (కరీంనగర్, పెద్దపల్లి, మంథని, జగిత్యాల,)
* శాసనసభ నియోజకవర్గాలు: 13 (మేడారం, నేరెళ్ళ, మంథని, పెద్దపల్లి, హుజూరాబాద్, కమలాపూర్, ఇందుర్తి, కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల, బుగ్గారం, మెట్‌పల్లి, సిరిసిల్ల)
* లోక్‌సభ స్థానాలు : 2 (పెద్దపల్లి, కరీంనగర్)
* పురపాలక సంఘాలు : 6
* నదులు: మానేరు. గోదావరి నది దాదాపు 283 కిలో మీటర్లు ఈ జిల్లాలో ప్రవహిస్తోంది.
* పుణ్య క్షేత్రాలు: వేములవాడ, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, కొండగట్టు, బిజ్ గిర్ షరీఫ్.
* దర్శనీయ ప్రదేశాలు: రామగిరి ఖిల్లా, ఎలగందుల ఖిల్లా.

పర్యాటక కేంద్రాలు

* వేములవాడ
* కాళేశ్వరము
* ధర్మపురి
* నాగునూరు కోట
* మంథని
* కొండగట్టు
* రైకల్
* మొలంగూరు ఖిల్లా
* శివారం వణ్యప్రాణీ సంరక్షణాలయము
* ఎలగందల్ ఖిల్లా
* దో మినార్
* మానేరు డాం



భౌగోళికంగా కరీంనగర్ జిల్లాను 57 రెవిన్యూ మండలాలుగా విభజించినారు.

1 ఇబ్రహీంపట్నం
2 మల్లాపూర్
3 రాయకల్
4 సారంగాపూర్
5 ధర్మపురి
6 వెల్గటూరు
7 రామగుండం
8 కమానుపూర్
9 మంథని
10 కాటారం
11 మహాదేవపూర్
12 ముత్తారం (మహాదేవపూర్)
13 మల్హర్రావు
14 ముత్తారం (మంథని)
15 శ్రీరాంపూర్ లేదా కాల్వ శ్రీరాంపూర్
16 పెద్దపల్లి
17 జూలపల్లి
18 ధర్మారం
19 గొల్లపల్లి
20 జగిత్యాల
21 మేడిపల్లి
22 కోరుట్ల
23 మెట్‌పల్లి
24 కత్లాపూర్
25 చందుర్తి
26 కొడిమ్యాల్
27 గంగాధర
28 మల్యాల
29 పెగడపల్లి
30 చొప్పదండి
31 సుల్తానాబాద్
32 ఓదెల
33 జమ్మికుంట
34 వీణవంక
35 మానకొండూరు
36 కరీంనగర్
37 రామడుగు
38 బోయినపల్లి
39 వేములవాడ
40 కోనరావుపేట
41 ఎల్లారెడ్డి
42 గంభీర్రావుపేట్
43 ముస్తాబాద్
44 సిరిసిల్ల
45 ఇల్లంతకుంట
46 బెజ్జంకి
47 తిమ్మాపూర్
48 కేశవపట్నం
49 హుజూరాబాద్
50 కమలాపూర్
51 ఎల్కతుర్తి
52 సైదాపూర్
53 చిగురుమామిడి
54 కోహెడ
55 హుస్నాబాద్
56 భీమదేవరపల్లి
57 ఎలిగెడ్
58 వేములవాda

0 comments:

Post a Comment

 

Site Info

Followers